ముంబై : రికార్డుల హోరుతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, మధ్యాహ్నం సమయానికి మరింత హైజంప్ చేశాయి. బ్యాంకులు, టెలికాం స్టాక్స్ ర్యాలీతో బెంచ్ మార్కు సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్ల మేర పైకి జంప్ చేసింది. ప్రస్తుతం 379 పాయింట్ల లాభంలో 33,592 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ తొలిసారి 10,400 మార్కును క్రాస్ చేసి 10,433 వద్ద లాభాలు పండిస్తోంది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన వ్యాపార సానుకూలత ర్యాంకింగ్స్లో భారత్ స్థానం మెరుగుపడటంతో మార్కెట్లకు మంచి సెంటిమెంట్ అందింది.
నిఫ్టీ బ్యాంకు కూడా 485 పాయింట్లు జంప్ చేసింది. టెలికాం దిగ్గజంగా పేరున్న ఎయిర్టెల్ అంచనాలకు మించి లాభాలను నమోదుచేయడంతో, ఈ కంపెనీ షేర్లు 10 ఏళ్ల గరిష్టంలో 8 శాతం పైకి ఎగిశాయి. సిండికేట్ బ్యాంకు షేర్లు కూడా క్యూ 2 ఫలితాలనాంతరం 10 శాతం పైగా లాభపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ కూడా భారీగా 22 పైసలు పైకి ఎగిసి 64.53 వద్ద ట్రేడవుతోంది.